Showing posts with label Indian Leaders. Show all posts
Showing posts with label Indian Leaders. Show all posts

Sunday, 23 March 2014

భగత్‌సింగ్ నాస్తికుడు కాదు, పూర్తి ఆస్తికుడు.

23 మార్చి, భారతీయ యోధులు, అమరవీరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్, భగత్‌సింగ్‌లను ఉరితీసిన రోజు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం సాధించడానికి సరిగ్గా 90 సంవత్సరాలకు పూర్వం 1857లో భారతీయులు ఆంగ్లేయులకు ఎదురు చేసి, ఆంగ్లేయుల తలలు నరికి, 300 పట్టణాలకు స్వాతంత్రం సాధించగలిగారు. ఇది భారతీయ తొలి స్వాతంత్ర సంగ్రామం. కానీ స్వార్ధపరులైన కొందరు రాజుల కారణంగా భారతదేశం తిరిగి తెల్లదోరల పాలనలోకి వెళ్ళిపోయింది. బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంపై అధికారం సంపాదించింది. ఈ తొలి స్వతంత్ర సంగ్రామం చూసి నివ్వెరపోయిన ఆంగ్లేయులు భారత్‌ను పాలించాలంటే, కొత్త చట్టాలను చేయాలనీ, అప్పటివార్కు దేశంలో అమలులో ఉన్న భారతీయ విద్యా విధానాన్ని నాశనం చేసి, బానిస విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా భారతీయులను అణిచివేయడానికి ఆంగ్లేయులు చేసిన ఒక చట్టం ఇండియన్ పోలిస్ యాక్ట్.




ఈ దేశంలో నిరసన తెలిపినవారిని నిరంకుశంగా కొట్టినా, చావబాదినా, ఆఖరికి చంపినా, అది తప్పు కాదని చెప్తూ, తాము చేస్తున్నా అత్యాచారాలను, అఘాయిత్యాలను, అక్రమాలను చట్టం మాటున సక్రమం చేయడమే దీని లక్ష్యం.

అటు తరువాత భారతదేశంలో కొత్తగా చేయాల్సిన చట్టాల గురించి అధ్యయనం కోసం సైమన్ కమీషన్‌ను నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ కమీషన్‌కు వ్యతిరేకంగా స్వాతంత్ర సమరయోధులలో ప్రముఖుడైన లాలా లజపతి రాయి గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. అక్కడున్న పోలీసు అధికారి లాలాలజపతిరాయ్ గారిపై దారుణంగా దాడి చేశారు. లాఠీతో తలపి బాదారు. ఒక్కసారి కాదు, దాదాపు 14-15 సార్లు, రాయ్ గారి తలపగిలేవరకు. రాయి్‌గారిని ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది, వారు మరణించారు. ఈ సంఘటన చూసిన భగత్‌సింగ్ బాధపడి, ఆ పోలీసు అధికారిపై వర్య తీసుకోమని కోర్టులో కేసు వేశాడు. ఎవరైనా మనిషిని శరీరం మీద కొడతారు కానీ, తలపై లాఠీతో కొట్టడం తప్పని భగత్‌సింగ్ వాదించినా, చట్టం ప్రకారం పోలీసులు ఏమైనా చేయచ్చు, అందులో తప్పులేదని కోర్టు తీర్పు ఇచ్చి, ఆ సదరు అధికారి నిర్దోషి అని ప్రకటించింది.

కోర్టు న్యాయం చేయకపోతేనేమి, నేను చేస్తాను అని యువుకుడైన భగత్‌సింగ్ ఆ అధికారిని చంపేశాడు. అటు తరువాత చాలా జరిగింది, భగత్‌సింగ్‌కు ఉరుశిక్ష విధించారు. ఉరి శిక్షకు గురైన భగత్‌సిగ్‌ను కలవడానికి అనేకమంది జనం జైలుకు వస్తూండేవారు. వారితో భగత్‌సింగ్ చెప్పిన ఆఖరి కోరిక 'నేను ఎలాగో మరణిన్సితున్నాను, ఈ దేశానికి స్వతంత్రం వచ్చేలోపు అనేక మంది భారతీయుల మరణాలకు కారణమైన ఈ ఇండియన్ పోలిస్ యాక్ట్ చట్టాన్ని తొలగించాలి' అని కోరుకున్నాడు. భారత్‌కు స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా అదే చట్టం దేశంలో అమలవుతోంది. కనీసం సవరణలు కూడా చేయలేదు మన పాలకులు. ఇదా మనం భగత్‌సింగ్‌కు ఇచ్చే నివాళి?

సేకరణ: శ్రీ రాజీవ్ దీక్షిత్‌గారి ఉపన్యాసం

భగత్‌సింగ్ గురించి మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. భగత్‌సింగ్ కమ్యూనిస్ట్ కాదు. కమ్యూనిస్టులే భగత్‌సింగ్‌ను హిజాక్ చేశారు, గాంధీని కాంగ్రెస్ హైజాక్ చేసినట్టు........... మన రాష్ట్రానికి చెందిన ఒక ఐ.పీ.యస్. ఈ విషయమై తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆయన భగత్‌సింగ్ కుటుంబ సభ్యునితో మాట్లడి తెలుసుకున్న విషయం ఏమిటంటే భగత్‌సింగ్‌లో జాతీయవాదానికి కారణం మాన్యులు, ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద్ సరస్వతి గారని, దయానందుని స్వతంత్ర కాంక్ష చేత భగత్‌సింగ్ ప్రభావితం చెందారు. ఒకరకంగా చెప్పాలంటే భగత్‌సింగ్ నాస్తికుడు కాదు, పూర్తి ఆస్తికుడు.

జోహార్ భగత్‌సింగ్
వందేమాతరం
జై హింద్

Courtesy:
Eco Ganesh

Saturday, 22 March 2014

Remembering Bhagat Singh,Rajguru and Sukhdev

Tribute to BHAGAT SINGH, SUKHDEV AND RAJGURU, 23d MARCH Martyr's Day

భారతదేశం మరువలేని మేరు సమాన ధీరులైన భగత్ సింగ్ (28 September 1907), సుఖ్‍దేవ్, రాజ్‍గురుల వర్ధంతి నేడు !!!
On this day in 1931 Shaheed Bhagat Singh, Sukhdev Thapar and Shivram Rajguru gave their life for India's freedom.
హుసేన్‍వాలా సమీపంలో భారత-పాకిస్తాన్ సరిహద్దు వద్ద భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్‍దేవ్ ల విగ్రహాలు

1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో బ్రిటిష్‌ పాలకులు వేళకాని వేళలో రాత్రి 7.30 గంటలకు భగత్‌సింగ్‌, అతని సహచరులు రాజగురు, సుఖ్‌దేవ్‌లను ఉరికొయ్యపై ఎక్కించి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు జరపడం నేరం.

మరణించే నాటికి వీరి వయస్సు వరుసగా 24,24,23

   భగత్ సింగ్ (24) 
    సుఖ్‍దేవ్(24) 
   రాజ్‍గురు (23)   


Monday, 17 March 2014

లీడర్ -అనేవాడు ప్రత్యేకంగా పుట్టడు. ప్రత్యేకత నుంచి పుట్టుకొస్తాడు. (Leadership Qualities)

లీడర్ -అనేవాడు ప్రత్యేకంగా పుట్టడు. ప్రత్యేకత నుంచి పుట్టుకొస్తాడు. అందుకే ప్రతి ఒక్కరిలోనూ లీడర్ -అపరిచితుడిలా దాగివుంటాడు. అలాగని తన లక్ష్యసాధన కోసమే బయటపడే అపరిచితుడు లీడర్ కాలేడు. లీడర్ తన కోసం తానుగా జీవించడు. జన హృదయాల ఘోషను శాంతింపజేయడానికి పోరాడుతాడు.

ఇటీవలి కాలంలో ‘అవినీతి’పై పోరు అంబరాన్ని అంటింది. ‘అన్నాహజారే! జిందాబాద్!’ అంటూ యువ హృదయాలు ఎగిసిపడ్డాయి. స్వచ్ఛతతో మద్దతు పలికాయి. మరి ఆ లీడర్ యువకుడు కానే కాదు. అయినా దేశమంతా పోరాట స్ఫూర్తితో ఊగిపోయింది. మరీ ముఖ్యంగా యువతరంగం ఎగిసిపడింది. చివరకు ఉద్యమ ఉద్ధృతికి ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. లీడర్ ఏ వయసు వాడైనా జన హృదయాన్ని గెలిచే సత్తా వుంటే -ఆ శక్తి లీడర్‌స్థాయిని అమాంతంగా పెంచేస్తుంది. మరి లీడరే యువకుడైతే?! ఉక్కు నరాలు.. ఇనుప కండరాలతో ప్రపంచ పునాదులే కదిలిపోతాయ్.
లీడర్ కావాలంటే మొదట కావాల్సింది ‘అంకితభావన’.. సమాజానికి తనను తాను సమర్పించుకోవాలి. సమస్యల పోరాటంలో మొదట తానొక్కడే! అతను ఎంచుకున్న మార్గలు, నడత, పనితీరు మొదలైన ఎన్నో నాయకత్వ లక్షణాలు అతనికో ‘దండు’ని ఏర్పరుస్తుంది. ఆ దండు అతనికి మరింత మనోబలాన్నిస్తుంది. అదే అతడి రక్షణ. ఆయుధం. ప్రతి విషయంలో మంచి చెడు వున్నట్లే లీడర్‌షిప్‌లో కూడా మంచి చెడు వుంటుంది. మంచి లీడర్‌షిప్ నిస్వార్థంతో కలకాలం నిలిచిపోతుంది. లీడర్‌షిప్‌లో చెడు దాగివుంటే అది బయటపడేలోపు జరగాల్సినంత నష్టం జరిగిపోతుంది.
ప్రతిరంగంలో లీడర్స్ ఉద్భవిస్తూనే వుంటారు. కాని స్వచ్ఛత కలిగిన లీడర్‌షిప్పే ఎక్కువ కాలం ప్రభావితం చేస్తుంది. ఓ గాంధీ.. నెల్సన్ మండేలా.. మదర్ థెరిసా.. సద్దాం హుస్సేన్.. గఢాఫీ యిలా ఎందరో లీడర్స్. వీరిలో స్వచ్ఛమైన నాయకత్వం వున్న లీడర్స్ వున్నట్లే స్వార్థపూరిత నాయకత్వం గల లీడర్స్ కూడా వున్నారు. కాని చరిత్రలో వారి స్థానాలేమిటో మనకు తెలియంది కాదు.
లీడర్‌కి ‘్ఛరిష్మా’ కావాలంటారు. నిజమే! లీడర్‌లో వున్న అన్ని క్వాలిటీస్‌తోపాటు ఆకర్షించే శక్తి (్ఛరిష్మా) వుంటే ఆ నాయకత్వ పటిమ మరింతగా దూసుకుపోతుంది. ఛరిష్మా వుండి మిగతా క్వాలిటీస్ లేకపోయినా నాయకత్వం నడుస్తుందంటే అది పునాది లేని బిల్డింగే అవుతుంది. అలాటి నాయకునికి ‘్ఫలోయర్స్’ వుంటారేగాని సమర్థవంతమైన ‘సపోర్టర్స్’ వుండరు.
లీడర్ అనే పదానికి సరైన పవర్‌ని అందించే రంగం ‘రాజకీయం’. పరిపాలనను చేజిక్కించుకోవడానికే లీడర్స్ అవతరిస్తూ వుంటారు. ప్రజానీకానికి లీడర్ ఎక్కువగా ఈ రంగం ద్వారానే పరిచయవౌతాడు. మన దేశంలో పరిపాలన మొదలైన నాటినుండి నేటి వరకు ఉద్భవించిన లీడర్స్‌యొక్క నాయకత్వాన్ని మనం చూసాం, చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని ప్రక్కనపెట్టి ఫాలోయర్స్ అధికంగా గల వాడే లీడర్ అనే స్థాయిలో మైండ్‌ని ఫిక్స్ చేసేసుకున్నాం.
నాయకత్వ లక్షణాలు అన్నింటిని ప్రక్కన పెట్టి నలగని దుస్తులు.. చెదరని మేకప్‌లతోపాటు నిత్యం అనుచరగణంతో సంచరించేవాడే నిజమైన లీడర్ అనుకునే భ్రమలోకి జారుకున్నాం. లీడరంటే ఇలాగే వుండాలి, ఇలాగే ప్రవర్తించాలని భావిస్తున్నాం. ఈ ముసుగులో లోఫర్ కూడా లీడరై కనిపిస్తున్నాడు. నిజమైన లీడర్స్ కనుమరుగైపోతున్నారు అనుకునే తరుణంలో అన్నాహజారే వంటి వ్యక్తులు నిజమైన లీడర్స్‌గా కనిపించడం యువతకు స్ఫూర్తిని కలగజేస్తుంది.
ఎలాగైనా సాధించాలి అనుకోవడం లీడర్‌షిప్ క్వాలిటీ కాదు. సైద్ధాంతిక ప్రకారం సాధించాలని చెప్పడం కరక్టే అయినా సమస్యకు అది సరిపోవాలి. అతివాదులు.. విప్లవకారులు సైతం మన దేశస్వాతంత్య్ర సమరంలో లీడర్స్‌గా తమ సత్తాను చాటారు. కాని గాంధీజీ అహింస.. సత్యాగ్రహ సిద్ధాంతమే సమస్యకు సరిపోయింది. ఇప్పటికీ అనేక సమస్యల సాధనకై ఎందరో లీడర్స్ తమ స్టయిల్స్‌లో పోరాటం చేస్తూనే వుంటారు. కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలిగే శక్తి కొందరి లీడర్స్‌లోనే వుంటుంది. అలాంటి లీడర్స్ అవతరించే వరకు సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే లభిస్తాయి.
యువతలో లీడర్‌షిప్ క్వాలిటీస్ విద్యార్థి జీవితంలోనే మొదలవుతాయి. అయినా కొంతమంది మాత్రమే లీడర్స్‌గా అవతరించగలుగుతారు. మిగతావారంతా భావాలను వ్యక్తీకరించే, సమర్థించే దండుగా మిగిలిపోతారు. మంచి ఆరేటర్ (వక్త) మంచి లీడర్ కాగలడు. తన ప్రసంగాలతో ఎందరినైనా ఆకర్షించి పోరాట స్ఫూర్తిని కలిగించగలడు. మాటను మించిన ఆయుధం మరొకటి లేదు. అందుకే ‘లీడర్’ పిలుపు కోసం ఎదురుచూస్తారు. ఇలాంటి పిలుపులో బలంవుండాలంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి లీడర్‌లో వుండాలి.
యువతలో నిద్రాణమైన ఉడుకునెత్తురు వుంటుంది. దానిని రగిలిస్తే ప్రళయం తప్పదు. అందుకే లీడర్ యువతకు స్ఫూర్తినిచ్చే తత్వం కలిగి వుండాలి. తన స్వార్థ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టించే లీడర్ దండుని కోల్పోక తప్పదు. భారతదేశంలో యువ జనాభా ఎక్కువ. అలాంటప్పుడు ఎంతమంది లీడర్స్ ఉద్భవించాలి? కానీ ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఏ రంగంలోనైనా మధ్యవయసు దాటి చరమాంకంలో పడ్డవారే లీడర్స్‌గా కనిపిస్తారు. ఎందుకిలా? లీడర్‌షిప్‌ని స్వీకరించాలంటే నిశ్చలతత్వం.. అంకితభావం కావాలి.
‘ఎవరో ఒకరు ఎపుడోకపుడు పోరాడుతారులే!’ అన్నభావన నానాటికీ పెరిగిపోతుంది. లీడర్ కావాలంటే స్వార్థరహిత జీవనం అలవాటు చేసుకోవాలి. నేడు సమస్యపై స్పందించేకంటే సర్దుబాటు చేసుకోవడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాం. అలాంటప్పుడు లీడర్ ఎలా అవతరిస్తాడు? నేడు సమాజంలో ఎన్నో రుగ్మతలు. వాటన్నింటిపట్ల ముందు స్పందించే గుణాన్ని యువత అలవాటు చేసుకోవాలి. అదే మీలో దాగున్న లీడర్‌ని మేల్కొలుపుతుంది. ఒక్కసారి మీలో లీడర్ మేల్కొన్నాక మీ లైఫ్‌స్టైలే మారిపోతుంది! ఎంత దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. మీలోని లీడర్‌షిప్ క్వాలిటీస్ మిమ్మల్ని పదిమందిలో ఒక్కరిగా కాకుండా పదిమందికీ ఒక్కరిగా నిలబెడుతుంది. అప్పుడు మీరే లీడర్.. మీలోని అంకితభావం.. నిస్వార్థం.. నిర్మలత్వం వంటివి మీలోని లీడర్‌కి గీటురాళ్ళుగా నిలుస్తాయ.

Friday, 7 March 2014

Durgabai Deshmukh-Indian freedom fighter, lawyer, social worker and politician.

Durgābāi,  Deshmukh  (July 15, 1909 – May 9, 1981) was an Indian freedom fighter, lawyer, social worker and politician. She was a member of the Constituent Assembly of India and the Planning Commission of India.

Born in Kakinada, Andhra Pradesh, India. Durgabai was married at the age of 14 to a Telugu person, later left and married C.D. Deshmukh, the first Indian Governor of the Reserve Bank of India and Finance Minister in India's Central Cabinet during 1950 - 1956. She was a public activist for women's emanicipation and was also the founder of Andhra Mahila Sabha. She was also the founder chairperson of central social welfare board.

Wednesday, 5 March 2014

First Woman Prime Minister in India

Indira Gandhi was born on November 19, 1917, in Allahabad, India. Gandhi was born into the politically prominent Nehru family; her father, Jawaharlal Nehru, served as India’s first prime minister. Gandhi served three consecutive terms as prime minister, between 1966 and 1977, and another term beginning in 1980. In 1984, Gandhi was assassinated by her Sikh bodyguards.

  • NAME: Indira Gandhi
  • OCCUPATION: Prime Minister
  • BIRTH DATE: November 19, 1917
  • DEATH DATE: October 31, 1984
  • EDUCATION: Visva-Bharati University,University of Oxford
  • PLACE OF BIRTH: Allahabad, India
  • PLACE OF DEATH: New Delhi, India
  • FULL NAME: Indira Priyadarshini Gandhi

The only child of Jawaharlal Nehru and the first prime minister of independent India, Indira Gandhi was born on November 19, 1917. A stubborn and highly intelligent young woman, she enjoyed an excellent education in Swiss schools and at Somerville College, Oxford.
After her mother died, in 1936, Gandhi became something of her father's hostess, learning to navigate complex relationships of diplomacy with some of the great leaders of the world.
In 2001, Gandhi was voted the greatest Indian Prime Minister in a poll organised by India Today. She was also named "Woman of the Millennium" in a poll organised by the BBC in 1999.

First Woman Governor of a State in India

Sarojini Naidu  born as Sarojini Chattopadhyay (Bengaliসরোজিনী চট্টোপাধ্যায়) was the first woman to become the governor of a state in India. After independence she became the Governor of Uttar Pradesh and died in office in 1949. 

·  Born: February 13, 1879, Hyderabad
·  Died: March 2, 1949, Lucknow



Sarojini Naidu is famously known as Bharatiya Kokila (The Nightingale of India). She was born on February 13, 1879. She attained national fame for entering Madras University at the age of twelve. She joined the Indian independence movement, in the wake of the aftermath of partition of Bengal in 1905. In 1925 she was elected as the President of the Congress, the first Indian woman to hold the post. She raised the issues of welfare of youth, dignity of labour, women's emancipation and nationalism. Sarojini Naidu was also a renowned poet.